బస్సు ప్రమాదంపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి... తక్షణ సాయం, పరిహారం ప్రకటన

by Kema Shiva Kumar |   (  Updated:2025-10-24 04:40:10  IST  )

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు శివారు చిన్నటేకూరు వద్ద జరిగిన బస్సు ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) స్పందించారు.

బస్సు ప్రమాదంపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి... తక్షణ సాయం, పరిహారం ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు శివారు చిన్నటేకూరు వద్ద జరిగిన బస్సు ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) స్పందించారు. ఈ దురదృష్టకర ప్రమాదం తనను ఎంతగానో బాధిస్తోందని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అదేవిధంగా మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా, క్షతగాత్రులకు తక్షణ సాయం కింద రూ.50 వేల పరిహారాన్ని ప్రకటించారు. అయితే, ఘటనా స్థలంలోనే మృతదేహాలకు స్పాట్‌లోనే పోస్ట్‌మార్టమ్ నిర్వహించబోతున్నట్లుగా తెలుస్తోంది. డీఎన్‌ఏ టెస్టుల ద్వారా మృతదేహాలను గురించి కుటుంబాలకు అప్పగించనున్నట్లుగా సమాచారం.

Read More: కర్నూలు బస్సు ప్రమాదం.. బైక్‌ను ఢీ కొట్టి 300 మీటర్లు ఈడ్చుకెళ్లిన బస్సు

క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి : ఏపీ బిజెపి చీఫ్

బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరం : రాష్ట్రపతి

Next Story